పోలీసు శిబిరంపై రాకెట్ లాంచర్లతో మావోలు దాడి

Update: 2023-06-23 15:17 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసు శిబిరంపై రాకెట్‌ లాంచర్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు మావోలుపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో అక్కడి నుంచి మావోలు పరారైనట్లు తెలుస్తోంది. బీజాపూర్‌ జిల్లా గంగలూర్‌ పరిధి హీరేలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోలు దాడిని బీజాపూర్‌ ఎస్పీ ఆంజనేయ వర్షనేయ ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

,

Tags:    

Similar News