President of bharat : ఇండియా పేరు మార్పు... ప్రత్యేక సమావేశాల్లో బిల్లు..?

Byline :  Kiran
Update: 2023-09-05 10:10 GMT

దేశం పేరు మారనుందా? ఇంగ్లీషులో ఇండియా నుంచి భారత్గా మార్చనున్నారా? ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రం భావిస్తోందా? జీ 20 సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే విందు ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ముద్రించడంపై ఈ ప్రశ్నలకు కారణమైంది. తాజా రాజకీయ పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.




 


రాష్ట్రపతి ముర్ము విందు ఇన్విటేషన్ తో పాటు జీ 20 సదస్సు కోసం రూపొందించిన బుక్ లెట్ లోనూ దేశం పేరు భారత్ అని రాశారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోడీ సర్కారు ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో ‘ఇండియా: దటీజ్‌ భారత్‌’ అని ఉండగా.. ఇకపై ‘భారత్‌’ అనే పేరు మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ సెషన్లో ఇండియా పేరు మార్పు ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 




Tags:    

Similar News