ఐఐటీ బాంబేలో వివక్ష.. మాంసం తినేవాళ్లు వేరే చోట కూర్చోవాలంటూ..

Update: 2023-07-30 14:13 GMT

ప్రముఖ ఉన్నత విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో విద్యార్థుల నడుమ వివక్షలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ మాంసాహారం తినే విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచాడు. పోయిన వారం హాస్టల్ 2లో ఈ ఘటన చోటు చేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో క్యాంటీన్ లో.. వెజ్ తినే వారి పక్కన నాన్ వెజ్ తినేవాళ్లు కూర్చోవద్దు అంటూ పోస్టర్లు వెలిశాయి. అంతేకాకుండా తమ పక్కన కూర్చోకుండా ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీనిపై కొందరు స్టూడెంట్స్ హాస్టల్స్ లో ఆహారం ఆధారంగా ఏదైనా విభజన ఉందా? అని ఆర్టీఐని అడగగా.. ఫుడ్ ఆధారంగా హాస్టల్స్ లో ఎలాంటి వివక్ష లేదని సమాధానం వచ్చింది.

ఈ ఘటనపై అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్ (ఏపీపీఎస్‌సీ) ట్విట్టర్ వేదికగా స్పందిచింది. ఆర్టీఐ ఆధారంగా ఆహారం విషయంలో ఎలాంటి వివక్ష లేకపోయినా.. వెజిటేరియన్స్ ఓన్లీ అని పోస్టర్లు అతికించడం ఏంటని ప్రశ్నించింది. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు ఇలాంటి వివక్షకు దారితీస్తున్నారని, అట్టడుగు వర్గాల వారిని అవమానించేందుకు ఈ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా, 2018లో నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్ కు ప్రత్యేక ప్లేట్స్ ఉపయోగించడంపై కూడా విమర్శలు వచ్చాయి.

Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi

Tags:    

Similar News