Sudhamurthy : రాజ్యసభకు సుధామూర్తి..శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Byline :  Vinitha
Update: 2024-03-08 08:36 GMT

ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. దీని పట్ల సంతోషం వ్యక్తం చేసిన మోదీ ఈ సందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు చెప్పారు. సుధామూర్తి రాజ్యసభలో ఉండడం నారీశక్తికి నిదర్శనమని అన్నారు. సోషల్ సర్వీస్, విద్యతో పాటు పలు రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇది మన దేశంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుందని అన్నారు.




 




 





Tags:    

Similar News