Odisha train accident: మోదీ.. రైల్వేమంత్రితో వెంటనే రాజీనామా చేయించాలి: రాహుల్ గాంధీ

Update: 2023-06-04 15:23 GMT

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంతో దేశం ఉలిక్కిపడింది. ఈ యాక్సిడెంట్ లో 275 మంది చనిపోగా.. 11వేల మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రైలు ప్రమాదానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసమర్థుల వల్ల అమాయకులు బలవుతున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.

‘270 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినా ఇప్పటివరకు కేంద్ర సర్కార్ జవాబుదారీగా వ్యవహరించడం లేదు. ఈ ఘోర దుర్ఘటనకు బాధ్యత వహించకుండా మోదీ ప్రభుత్వం తప్పించుకోలేదు. ఫలితం అనుభవిస్తారు. ప్రధాని మోదీ వెంటనే రైల్వేశాఖ మంత్రితో రాజీనామా చేయించాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.





 


Tags:    

Similar News