ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Byline :  Bharath
Update: 2023-11-15 08:28 GMT

బస్సు అదుపు తప్పి లోయలో పడ్డ ఘటన జమ్మూకశ్మీర్ లోని డోడా జిల్లాలో జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 15 మంది మృత్యువాత పడ్డారు. జమ్ము కశ్మీర్ డోడ జిల్లాలోని బాటోటె- కిష్ట్వార్ జాతీయ రహదారిలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు 250 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన పలువురిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. మృతు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక పోలీసులు చెప్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News