Sanjiv Bhatt: మాజీ ఐపీఎస్కు సుప్రీంకోర్ట్ షాక్.. రూ.3 లక్షల జరిమానా
డ్రగ్ ప్లాంటింగ్ కేసులో తనకు అన్యాయం జరిగిందని ఓ మాజీ ఐపీఎస్ అధికారి.. పదే పదే పిటిషన్లను దాఖలు చేస్తున్నందుకు సుప్రీం అతనికి షాక్ ఇచ్చింది. కేసు నుంచి బయటపడేందుకు.. అదనపు సాక్ష్యాల కోసం ఓ పిటిషన్, విచారణను బదిలీ చేయాలని మరో పిటిషన్, ఆడియో మరియు వీడియో రికార్డింగ్లను కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తున్నందుకు అతనికి రూ. త్రీ లక్షల జరిమానా విధించింది. జస్టిస్ విక్రమ్నాథ్, రాజేశ్ బిందాల్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సంజీవ్ భట్ ఇటీవల వరుసగా మూడు సార్లు కోర్టులో పిటిషన్లను దాఖలు చేయగా.. ఒక్కొక్క దానికి రూ. లక్ష చొప్పున, అతనికి మూడు లక్షల ఫైన్ వేశారు. సుప్రీంకోర్టుకు ఎన్ని సార్లు వచ్చావని, కనీసం ఓ డజన్ సార్లు వచ్చావా అని జస్టిస్ విక్రమ్నాథ్ ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం వద్ద ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
1996లో బనస్కాంత జిల్లా పోలీసు సూపరింటెండెంట్గా ఉన్న సంజీవ్ భట్.. రాజస్థాన్కు చెందిన ఓ లాయర్ సుమేర్సింగ్ రాజ్పురోహిత్ ను అరెస్టు చేశారు. ఆయన బస చేసిన హోటల్ రూమ్ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. అయితే ఆ లాయర్పై తప్పుడు కేసును బనాయించినట్లు రాజస్థాన్ పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో భట్ 2018 సెప్టెంబర్లో అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి అతను జైలులోనే ఉన్నాడు.