జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు

Byline :  Shabarish
Update: 2024-02-24 15:46 GMT

బ్రిటీష్ వలస పాలనలోని ఆనాటి క్రిమినల్ చట్టాలు ఇకపై ఉండవు. ఆ చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను భారత కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఆ కొత్త చట్టాలు జులై 1వ తేది నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. భారతీయ న్యాయ సంహింత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య వంటి కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించడంతో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేయడంతో తాజాగా కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు.


Tags:    

Similar News