Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Update: 2024-02-29 03:09 GMT

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బాధితులు గోద్ భరై కార్యక్రమం నుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సంపతీయ ఉయికేని సీఎం ఆదేశించారు.


Tags:    

Similar News