Jayaprada : ప్రముఖ నటి జయప్రదపై నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ

Byline :  Veerendra Prasad
Update: 2024-02-13 02:43 GMT

అలనాటి ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల కోర్టు. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటి విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్​ చేసి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరు పరచాలని రాంపుర్​ ఎస్​పీకి ఆదేశాలు జారీ చేసింది.

గత 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున రాంపుర్​ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు కాగా,​ ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

జయప్రద తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో గొప్ప పేరున్న నటి. 300కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఎస్​పీలో చేరి, రాంపుర్​ లోక్​సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్​ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి, రాంపుర్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.



 


Tags:    

Similar News