కేజ్రీవాల్ పిటిషన్ పై అత్యవసర విచారణ

By :  Vinitha
Update: 2024-03-22 07:23 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తనను అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ చంద్రచూడ్ ప్రత్యేక బెంచ్ కు కేటాయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ద్వివేదీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది.

ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు...ఈడీ అరెస్ట్ ను తప్పించలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు రెండు గంటల విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఈడీ ఆఫీసుకు తరలించారు. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది.

Tags:    

Similar News