క్రైమ్ స్టోరీ రాయాలని దొంగతనం చేసిన 'స్టోరీ రైటర్'.. చివరకు

Update: 2023-07-07 02:41 GMT

కథలు రాయడం అతడికి హాబీ. దోపిడీ అంశంతో మంచి క్రైమ్ థ్రిల్లర్​ కథ రాయాలనుకున్నాడు. ఏదో ఊహించుకుని, ఎవరి కథో ఎందుకని.. తానే ఓ దొంగతనం చేసి సొంత అనుభవాలతో స్టోరీ రాయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ స్టోరీ క్లైమాక్స్ మాత్రం పోలీసుల రాయడంతో చివరకు కటకటాల పాలయ్యాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని​ ఫరీదాబాద్​లో ఈ విచిత్ర ఘటన జరిగింది

అసలేం జరిగిందంటే?

​రోహ్​తక్​ ఏక్తా కాలనీలో నివాసం ఉంటున్న ఇర్షాద్.. ఫరీదాబాద్​లోని డబువా పాలి రోడ్డులో ఉన్న ఫ్యాన్​ రెగ్యులేటర్లు తయారు చేసే సంజనా టూల్స్ అనే కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఏడాది కాలంగా పనిచేస్తున్న కృష్ణ కు.. గోరఖ్​పుర్​ జిల్లాకి చెందిన శైలేంద్ర కుమార్​ అనే ఓ నేరగాడు పరిచయమయ్యాడు. అతడు ఇప్పటికే పలు కేసుల్లో దాదాపు ఎనిమిదేళ్లు జైలు జీవితం గడిపాడు. శైలేంద్ర ప్లాన్ తో తన సొంత కంపెనీ సంజనా టూల్స్​లో చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు కృష్ణ . ఆ పథకాన్ని అమలు​ చేయడానికి అదే కంపెనీలో పనిచేస్తున్న సౌరభ్, ఇర్షాద్​లకు చెప్పడంతో... వారు సరే అన్నారు. ఇర్షాద్ తన స్టోరీ కి ఈ చోరీ బాగా ఉపయోగపడుతుందని భావించి రంగంలోకి దిగాడు.




 


మొత్తానికి నలుగురు కలిసి జూన్​ 21న కంపెనీలో దొంగతనం చేశారు. యజమాని కుందన్​లాల్​ను కొట్టి.. కట్టేశారు. అనంతరం రాగి తీగల కట్టలు, 58 వేల నగదు, యాజమాని స్కూటీతో పాటు మరికొన్ని విలువైన వస్తువులతో పరారయ్యారు. సమాచారం అందున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు చర్యలు చేపట్టిన ఫరీదాబాద్​ క్రైమ్​ బ్రాంచ్ సెక్టార్​-48​ పోలీసు బృందం.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. సౌరభ్​ మాత్రం తప్పించుకున్నాడు. నిందితుల వద్ద నుంచి 2 రాగి తీగల కట్టలు, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తీసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఎలాంటి నేర చరిత్ర లేని ఇర్షాద్​కు.. కథలు రాయడం అంటే పిచ్చి అని , దొంగతనం చేసి తన సొంత అనుభవాలతో కథ రాయాలనుకున్నాడని తెలిసింది. కానీ విధి వికటించి పోలీసులకు చిక్కాడు.




Tags:    

Similar News