Mukesh Ambani : అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జూకర్ బర్గ్ దంపతులు

Byline :  Vamshi
Update: 2024-03-02 03:18 GMT

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్, సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభ అయ్యాయి. పాప్ సంచలనం రిహన్న బృందం ప్రదర్శనతో వేడుకలు శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభ అయ్యాయి. జామ్ నగరంలో 3 రోజులు పాటు జరగనున్న ఈ వేడుకలకు మేటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ దంపతులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీవెడ్డింగ్‌ వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ భారీగా ప్లాన్‌ చేసిందట. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిరథ మహరథుల కోసం ఘుమఘమలాడే వంటకాలను వడ్డించనున్నారు.




 


సుమారు 2500 రకాల వంటకాలతో ఆశ్చర్యపరచునున్నారట. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 25 మంది చెఫ్‌ల బృందాన్ని జామ్‌నగర్‌కు రప్పించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాలతోపాటు ఇండోర్ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు. అయితే వివాహ వేడుకలు ప్రారంభం నుంచి ముగిసేవరకు మొత్తం రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇంత ఖర్చు అయితే.. దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా ఇది నిలిచిపోనుంది. ఈ వేడుకకు .మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , అడోబ్ సీఈవో శంతను నారాయణ్, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి హాజరుకానున్నారు.




Tags:    

Similar News