School Buss : నీటి కుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 40మంది విద్యార్థులు..

Byline :  Krishna
Update: 2023-09-23 05:22 GMT

ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపుతప్పి నీటి కుంటలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

వికారాబాద్‌ జిల్లా సూల్తాన్‌పూర్‌లో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సు అదుపుతప్పి నీటికుంటలోకి దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను రక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. అయితే స్కూల్ యాజమాన్యం ఫిట్ నెస్ లేని బస్సులు నడపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు బాగాలేవని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు.


Tags:    

Similar News