గ్రూప్‌-4 పరీక్షకు సర్వం సిద్ధం... TSPSC కీలక సూచనలు

Update: 2023-06-30 13:29 GMT

తెలంగాణ గ్రూప్ 4 పరీక్షకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్ 4 పరీక్ష రాసే అభ్యర్థులకు TSPSC కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా.. పరీక్షకు 15నిమిషాల ముందే 9.45కి గేట్లు మూసివేయనున్నారు. పేపర్‌-2కి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతిస్తామని.. 2.15కి గేట్లు మూసివేస్తారు. వాచ్, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్ష హాలులోకి నిషేధం. అభ్యర్థులు షూస్ వేసుకొని రావొద్దని... చెప్పులు వేసుకుంటే అనుమతిస్తారని TSPSC సూచించింది. హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగించినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కాదు.

పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్‌-2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.మొత్తం 9.51 లక్షల మంది గ్రూప్‌-4కు దరఖాస్తు చేసుకున్నారు.


Tags:    

Similar News