Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. భయంతో జనం పరుగులు

Byline :  Krishna
Update: 2024-01-27 13:04 GMT

సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. సంగారెడ్డి పట్టణంతోపాటు న్యాల్కల్‌, ముంగి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. సాయంత్రం 4.30కు ప్రకంపనలు రావడంతో జనం భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రజలు భయపడొద్దని సూచించారు. 


Tags:    

Similar News