Ponnam Prabhakar : బండి సంజయ్పై పొన్నం ప్రభాకర్ సీరియస్

Byline :  Bharath
Update: 2024-02-28 07:09 GMT

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి పొన్ని ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తన తల్లిని అవమానించేలా బండి సంజయ్ మాట్లాడారని పొన్నం మండిపడ్డారు. రాజకీయాలతో తన తల్లికి ఏం సంబంధముందని.. ఆమెను ఇందులోకి లాగుతున్నారని పొన్నం ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బండి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఆయన నాలుకకు దురద ఎక్కువైందని విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.

ఎంపీగా తెలంగాణ, హుస్నాబాద్‌కు పొన్నం ప్రభాకర్ ఏం చేయలేదని, ఒకవేళ ఏం చేశావని ప్రశ్నిస్తే ఆయన తల్లి ఆత్మక్షోభిస్తుందని బండి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన పొన్నం.. బతికున్న ఆమెను అవమానపరుస్తారా? మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావు. నా దయాదాక్షిణ్యాల మీద అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ అయ్యావు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా?. జాగ్రత్త! అని బండిని ఉద్దేశించి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐదేళ్ల టైంలో ఏపీగా కరీంనగర్ కు ఏం చేశావని ప్రశ్నించారు. రాజకీయ డ్రామాలకు తెర లేపుతూ ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల అడగడం దారుణమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే యాత్రలు చేయలేడని హెచ్చరించారు. 




Tags:    

Similar News