మోదీ సభకు.. అధ్యక్షుడి హోదాలో వస్తానో లేదో: బండి సంజయ్

Update: 2023-07-03 02:20 GMT

ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తుంటే.. బీజేపీ నేతుల మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం కూడా బండిని తప్పించి.. కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యలు అప్పగించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్.. పార్టీ కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు.. ఆ వార్తలను నిజం చేస్తున్నాయి.

ప్రధాని మోదీ జులై 8న హన్మకొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటిస్తున్న క్రమంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏర్పాట్లను బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం ఆయన వివిధ గ్రామాల కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు బండి సంజయ్ ని ‘మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలం’టూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంలో కార్యకర్తలతో మాట్లాడిన బండి.. ప్రధాని మోదీ సభకు తాను అధ్యక్షుడి హోదాలో వస్తానో లేదో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని టూర్ ను విజయవంతం చేయాలని సమాధానం ఇచ్చారు.

Tags:    

Similar News