Bandi Sanjay: కేసీఆర్ ఆటలో రేవంత్, హరీష్ రావు బలిపశువులు : బండి సంజయ్

By :  Krishna
Update: 2023-10-12 16:09 GMT

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్ కు వెళ్లిందని.. కేసీఆర్ ఆమోదం కోసం వెయిట్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియక ఆగమాగం అవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని.. ప్రధాని మోదీ బీఆర్ఎస్ బండారాన్ని బయటపెట్టారని చెప్పారు.

కేసీఆర్ ఆడే ఆటలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు బలిపశువులు కాబోతున్నారని బండి సంజయ్ అన్నారు. ‘‘ మా అభ్యర్థుల జాబితా ఢిల్లీకి వెళ్లింది. కాంగ్రెస్ది ప్రగతిభవన్కు వెళ్లింది. ఈ విషయం రేవంత్కు తెలియదు. అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ కలిసికట్టుగా ప్రయత్నిస్తున్నాయి. రేవంత్, హరీష్‌లు ఇద్దరు బలిచ్చే బకరాలు. కాంగ్రెస్‌లో బకరా రేవంత్ అయితే, బీఆర్‌ఎస్‌లో హరీష్ రావు’’ అని సంజయ్ అన్నారు.

కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బండి సంజయ్ అన్నారు. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు ఆ మూడు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

Tags:    

Similar News