తెలంగాణ బీజేపీ నేతలను ముడ్డిమీద తన్నాలి..ఆ పార్టీ నేత జింతేదర్ రెడ్డి

Update: 2023-06-29 05:07 GMT

తెలంగాణ బీజేపీ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆధిపత్యం కోసం ఆరాటం, వచ్చే ఎన్నికల్లో వీలైతే పెద్ద చాన్సు వంటి అవకాశాల కోసం నేతలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీకే చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఘాటు వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలంగాణ కాషాయ నాయకత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ ఓ కామెడీ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. సొంత పార్టీ నేత, అదీ జాతీయ కార్యవర్గ సభ్యుడే ఇలా చురక అంటింటిచడం విశేషం.

వీడియోలో ఓ వ్యక్తి జడలబర్రెను వాహనంలో ఎక్కిస్తున్నాడు. అది పైకి ఎక్కకపోవడంతో దాని ముడ్డిపై తన్ని ఎక్కించాడు. తర్వాత చుట్టుపక్కల ఉన్న పశువుల కూడా కనిపిస్తాయి. ‘‘బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఇలాంటి చికిత్స చేయాలి’’ అని జితేందర్ రెడ్డి కామెంట్ పెట్టారు. అంతేకాకుండా ఆ ట్వీట్‌ను బీజేపీ జాతీయ నేతలైన బీఎల్ సంతోష్, అమిత్ షాలకు కూడా ట్యాగ్ చేశారు. ఈ వీడియో రాజకీయ పార్టీల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదతర నేతల మధ్య విభేదాలు, పరిష్కారం కోసం ఢిల్లీకి పయనాల నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఈ వీడియో వదిలారు.

Tags:    

Similar News