సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం : విజయశాంతి

Byline :  Krishna
Update: 2023-09-18 08:49 GMT

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో సోనియాగాంధీపై బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోనియాను తెలంగాణ ప్రజలు అభిమానంతోనే చూస్తారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆమెను గౌరవిస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

అంతేకాకుండా ఎంఐఎంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి సమర్ధించారు. ఎంఐఎం బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే అని తుక్కుగూడ సభలో రాహుల్ చెప్పడం కరెక్టే అని అన్నారు.

‘‘ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అని..సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే మిగితా రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం. అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా?’’ అని అన్నారు.

అంతేకాకుండా ‘‘ ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి, ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం’’ అని ట్వీట్ చేశారు.


 


Tags:    

Similar News