బీజేపీ దూకుడు.. పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

By :  Krishna
Update: 2023-11-04 12:21 GMT

తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సమయంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే మూడు విడతల్లో 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. ప్రచారంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ను రంగంలోకి దించుతోంది. బండి సంజయ్తో పాదయాత్ర నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. అధిష్టానం సూచనలతో సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు.

కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 7న కరీంనగర్ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 8న సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఈ యాత్ర తర్వాత సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే అధిష్టానం ఆయన కోసం హెలికాఫ్టర్ను సిద్ధం చేసింది.

కరీంనగర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్న సంజయ్.. ఈ నెల 6న సంజయ్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రచార స్పీడ్ను పెంచనున్నారు.


Tags:    

Similar News