లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

By :  Krishna
Update: 2024-02-21 15:11 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో గతంలో కవితను సీబీఐ ప్రశ్నించింది. ఆమె నివాసంలోనే విచారించి.. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఈ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్ గా మారాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు కవిత పీఏ సైతం అప్రూవర్గా మారినట్లు సమాచారం. సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా..? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News