Train Accident : నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్

Byline :  Krishna
Update: 2024-01-10 04:34 GMT

నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. డెడ్ ఎండ్ లైన్ గోడను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. చెన్నై నుంచి వచ్చిన ఈ రైలును నాంపల్లి రైల్వే స్టేషన్లో నిలిపే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లోకో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలవడంతో వారిని వెంటనే లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.

Tags:    

Similar News