చికోటి ప్రవీణ్కు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

By :  Lenin
Update: 2023-07-26 14:26 GMT

లాల్ దర్వాజ బోనాల సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీతో హల్ చల్ చేసి వార్తల్లో నిలిచిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దాంతో ఆయనపై పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసుపై నాంపల్లి కోర్ట్ చికోటి ప్రవీణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

చికోటి ప్రవీణ్.. బోనాల ఉత్సవాల్లో ప్రైవేట్ గన్ మెన్స్ తో గుడికి వెళ్లాడు. సెక్యూరిటీ వద్ద గన్స్ చూసిన పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. తర్వాత వాళ్లను అదుపులోకి తీసుకుని.. లైసెన్స్ రిన్యూవల్ చేసుకోకుండా గన్స్ వాడుతున్నారని వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ముగ్గురు గన్ మెన్స్.. రమేష్‌గౌడ్‌, సుందర్‌నాయక్‌, రాకేష్‌కుమార్‌లను అరెస్ట్ చేసి విచారించారు. తర్వాత ప్రవీణ్ ను ఏ1 ముద్దాయిగా మార్చారు పోలీసులు. ఈ క్రమంలో ప్రభుత్వం తనపై కక్ష పూర్తిత కుట్ర చేసి ఏ1 ముద్దాయిగా మార్చిందంటూ ఆరోపించిన ప్రవీణ్.. నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. దీంతో బుధవారం (జులై 26) విచారణ జరిపిన కోర్ట్ ప్రవీణ్ కు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది.  

Tags:    

Similar News