నేడు తొర్రూరు, హాలియా, ఇబ్రహీంపట్నంలో కేసీఆర్​ సభలు

Update: 2023-11-14 04:20 GMT

గులాబీ దళపతి, సీఎం కేసీఆర్​ తన ప్రచారంతో బీఆర్​ఎస్​ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. ప్రజా​ ఆశీర్వాద సభలతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్​ సీఎం కావాలని ఉవ్వెళ్లూరుతున్నారు. అందులో భాగంగా గత నెల అక్టోబర్ 15న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక ప్రచారంలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం మహబూబాబాద్​ రోడ్​లోని సభాస్థలిలో బీఆర్​ఎస్​ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. కేసీఆర్​ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభకు దాదాపు 80 వేల నుంచి లక్ష మంది వరకూ హాజరవుతారని బీఆర్​ఎస్(BRS)​ అంచనా వేస్తుంది.

ఇప్పటికే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో జనగామ, మహబూబాబాద్​, వర్ధన్నపేట, నర్శంపేట నియోజకవర్గాల్లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న సభ ఈ జిల్లాలో ఐదోది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పాలకుర్తి సభ అనంతరం.. ముఖ్యమంత్రి హెలికాప్టర్​లో నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం నుంచి కేసీఆర్ సభలు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News