జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సీఎం

By :  Kiran
Update: 2024-03-14 08:20 GMT

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు. జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పాలమూరు టికెట్‌ను బీజేపీ డీకే అరుణకు ఇవ్వడంతో జితేందర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లునన్నట్లు తెలుస్తొంది. అసంతృప్తికి గురైన జితేందర్ రెడ్డితో కాంగ్రెస్ చర్చలు జరిపింది.

ప్రస్తుతం మల్కాజిగిరి కోసం బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెదుకుతోంది. జితేందర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్‌ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి పలు సెటైరికల్‌ వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్‌ చేయడంతో​ బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్‌ జితేందర్‌ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News