పీవీకి భారత రత్న ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం

By :  Kiran
Update: 2024-02-09 10:13 GMT

తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన ఆయనకు భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడైన పీవీని భారతరత్న వరించడం ఆనందంగా ఉందన్నారు. ఇది తెలంగాణ బిడ్డల అందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమని అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ లకు భారత రత్న ఇవ్వడంపై రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు.



Tags:    

Similar News