CM Revanth Reddy : కాసేపట్లో కేరళకు సీఎం రేవంత్ రెడ్డి

Byline :  Krishna
Update: 2024-02-29 08:20 GMT

సీఎం రేవంత్ కాసేపట్లో కేరళ వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంతపురంలో గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కేరళ వెళ్తారు. ఇవాళ రాత్రికి తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. కాంగ్రెస్ ప్రధాని కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమరాగ్ని యాత్రను చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ తిరువనంతపురం వెళ్లారు.


Tags:    

Similar News