తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ల మార్పు

Byline :  Krishna
Update: 2023-12-23 14:28 GMT

పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఇంఛార్జులను మార్చింది. తెలంగాణ ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షిని నియమించింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రేను గోవా ఇన్ఛార్జ్గా నియమించింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలను మాణిక్కం ఠాగూర్కు అప్పగించింది. రణదీప్ సింగ్ సుర్జేవాలను కర్నాటక, సచిన్ పైలట్ను ఛత్తీస్ గఢ్, అవినాష్ పాండేను ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్లుగా నియమించింది. జైరాం రమేష్ను కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్గా, కేసీ వేణుగోపాల్ను ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా కొనసాగించింది. దీపాదాస్ మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్గా పనిచేశారు. కేరళ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమెకు తెలంగాణ బాధ్యతలను కూడా అప్పగించారు. 

Tags:    

Similar News