తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

By :  Vinitha
Update: 2024-03-23 11:52 GMT

ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అదే సభలో మల్లీకార్జున ఖర్గే ఏఐసీసీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ బహిరంగ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేయనున్నారు.

Tags:    

Similar News