కేటీఆర్ మాట్లాడుతుంటే.. సభకు ఎందుకు వస్తున్నామా అనిపిస్తోంది

Update: 2023-08-05 17:21 GMT

తెలంగాణ రాష్ట్ర సమస్యలపై 60 రోజులు పాటు జరగాల్సిన శాసన సభ సమావేశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం 10 రోజులకు కుదించడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలకు కేటీఆర్ అడ్డగోలు సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు. పందులు, కుక్కలు, గాడిదలు అంటూ కేటీఆర్ మాట్లాడుతుంటే.. సభకు ఎందుకు వస్తున్నామా? అని బాదేస్తుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన భట్టి కేటీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తుంటే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వర్షాల వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నిస్తుంటే.. వాటిని దాటవేస్తూ ప్రభుత్వం తీరును విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలంటే చిన్న చూపా, గ్రామ పంచాయితీలకు నిధులెందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత తానేంటో చూపిస్తానని అన్నారు.


Tags:    

Similar News