Eatala : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది

Update: 2024-02-03 16:25 GMT

భారత దేశం సురక్షంగా ఉండాలంటే మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇక మునిగిపోయే నావ లాంటిదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాలేని ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీయే సరైన వేదిక అని ఈటల అన్నారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే మోదీతోనే సాధ్యమని పలువురు నేతలు భావిస్తున్నారన్నారు.

తెలంగాణలో ఇకపై ఉండేది.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమేనని, బీఆర్ఎస్ కనిపించదన్నారు. కాంగ్రెస్ పాలనపై కూడా ఈటల స్పందించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై తాను ఇప్పుడే మాట్లాడనన్నారు. కానీ గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన అనుభవంతో తనకు తెలిసి.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. అమలు కానీ హామీలుగానే మిగిలిపోవచ్చునని జోస్యం చెప్పారు. భవిష్యత్తు బీజేపీదే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో పునాదులు వేసుకున్నామని.. ఇకపై తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండా మాత్రమే అన్నారు. ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ నేతలు భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారన్నారు. రాబోయేది బీజేపీ రాజ్యమని. తెలంగాణలో ఎగరబోయేది కాషాయ జెండా’’ అని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News