Hyderabad Drugs : గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టివేత...ఓ రాజకీయ నేత కుమారుడి అరెస్ట్

Byline :  Vinitha
Update: 2024-02-26 03:15 GMT

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న ఓ రాజకీయ నేత, వ్యాపారవేత్త కుమారుడు, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులనుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. రాజకీయ నాయకుడి కుమారుడు ఓ స్టార్ హోటల్ లో అర్థరాత్రి విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు. విందులో మత్తు పదార్థాలు స్వీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News