సికింద్రాబాద్‌లో మద్యం మత్తులో యువతి హల్చల్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-10 08:19 GMT

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో మద్యం మత్తులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. రెండు గంటల పాటు బోయిన్ పల్లి ప్రధాన రహాదారి పై హంగామా సృష్టించింది. పోలీసులను బండబూతులు తిడుతూ విరుచుకుపడింది. అప్పటివరకూ ఓపిక పట్టిన పోలీసులు.. చివరకు ఆ యువతిని స్టేషన్‌కు తరలించారు.




 


ఓ ఈవెంట్‌కు వెళ్తున్న యువతి మిత్రులతో కలిసి మద్యం సేవించి కారును వేగంగా డ్రైవ్ చేసింది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద వేగంగా కారు నడపడం చూసి అనుమానం కలిగిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ వాహనాన్ని రెండు కిలో మీటర్లు వెంబడించారు. చివరకు ఆమెను ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్​ను యువతి కారుతో ఢీ కొట్టి వెళ్లిపోయింది. చివరకు తాడ్​బండ్ సమీపంలో కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో యువతి వివాదానికి దిగడంతో దాదాపు రెండు గంటల పాటు బోయిన్​పల్లి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యువతిపై పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.




Tags:    

Similar News