రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు.. ఉద్రిక్తత..

By :  Krishna
Update: 2023-11-24 17:10 GMT

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ సహా టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. జూబ్లీహిల్స్లోని గోయల్ ఇంట్లో భారీగా డబ్బు డంపు చేశారని సమాచారంతో అధికారులు సోదాలు చేపట్టారు. గోయల్ 2010లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేశారు. ఈ సమాచారంతో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నాడంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అతడి బైక్‌ను అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు.

Tags:    

Similar News