జూన్ 9న చేప మందు ప్రసాదం పంపిణీ

Update: 2023-06-07 02:40 GMT

కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన చేప మందు పంపిణీని తెలంగాణ సర్కార్ ఈ ఏడాది నిర్వహించనుంది. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు నిరంతరంగా చేప మందు ప్రసాదం పంపిణీ జరుగనుంది. ఎప్పటిలాగే ఈ సారి చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికైంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి లక్షలాదిగా వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది కౌంటర్లను కూడా అధికంగా ఏర్పాటు చేశామని తెలిపారు. మందు పంపిణీకి అవసరమైన చేప పిల్లలను రష్ట్ర మత్స్యశాఖ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News