లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

By :  Kiran
Update: 2023-12-25 09:22 GMT

లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధత గురించి వివరించారు.

లోక్ సభ ఎన్నికలకు అందరూ సమాయత్తం కావాలని, అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా భేటీలు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. సోమవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో భేటీ అయిన ఆయన.. జనవరి 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని నేతలకు కేటీఆర్ సూచించారు. ఇంఛార్జులు తమ నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటించాలని చెప్పారు.




Tags:    

Similar News