అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ రద్దు!

By :  Bharath
Update: 2023-12-28 11:58 GMT

దేశంలోనే తొలిసారిగా.. హైదరాబాద్ వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా.. హుస్సేన్ సాగర్ తీరంలో ఈ ఈవెంట్ ను నిర్వహించారు. దేశంలో తొలిసారి జరిగిన అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్ షిప్ చూసేందుకు.. అంతా హైదరాబాద్ కు క్యూ కట్టారు. ఇటీవల నగరంలో మరోసారి రేసింగ్ జరగనుందనే వార్తలు వినిపించాయి. 2024 ఫిబ్రవరిలో ప్రతిష్ఠాత్మకంగా జరగాల్సిన ఈ ఈవెంట్ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్‌ రద్దయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లీగ్ నిర్వాహణకు ఇంకా పర్మిషన్ రాలేదని ఫార్ములా ఇ సంస్థ తాజా ప్రకటనలో తెలిపింది.

ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ‘ఫార్ములా -ఇ’ ఓ ప్రకటనలో చెప్పింది. ఇప్పటికే ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం కొత్త ప్రభుత్వంతో సమావేశం జరిపింది. కాగా ఈవెంట్ నిర్వహణకోసం చాలా కంపెనీలు ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి. గత ఈవెంట్ ద్వారా ప్రభుత్వానికి, నిర్వహణ సంస్థకు 84 మిలియన్ డాలర్ల మేర ఆర్ధిక లబ్ధి జరిగింది.




Tags:    

Similar News