తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ఈసీ ఆఫీసుకు గద్దర్

Update: 2023-06-21 07:59 GMT

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త ఎంట్రీ ఇవ్వనుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ‘‘గద్దర్‌ ప్రజా పార్టీ’’ పేరుతో ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కు ఆయన వెళ్లారు. తన పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల అధికారులను కలిశారు.

పాటతోనే ప్రస్థానాన్ని ప్రారంభించి, పాటతోనే ప్రజా ప్రస్థానాన్ని ముగిస్తానని చెప్పిన గద్దర్.. ఇప్పుడు కొత్త పార్టీకి శ్రీకారం చుట్టడం ఆసక్తిగా మారింది. కాగా గద్దర్ ప్రజా పార్టీ జెండాలో మూడు రంగులు, మధ్యలో పిడికిలి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. గద్దర్ తన ప్రయాణాన్ని ఎరుపురంగుతోనే ప్రారంభించారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేశ్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించబోతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గద్దర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Tags:    

Similar News