Ganja Chocolates : తెలంగాణలో గంజాయి చాక్లెట్ల కలకలం.. భారీగా పట్టుబడి..

Byline :  Krishna
Update: 2024-01-30 07:36 GMT

తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో మత్తు చ్లాకెట్లు దొరకడం చర్చనీయాంశంగా మారింది. నార్సింగి పరిధిలోని కోకాపేటలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కోకాపేట్ రాంకీ కన్స్ట్రక్షన్ దగ్గర అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ అపార్ట్మెంట్ వద్ద కార్మికులకు చాక్లెట్లు అమ్ముతుండగా ఒడిశాకు చెందిన వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. సోమ్య రాజన్ వద్ద 40 గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.




 


అదేవిధంగా ఖమ్మంలోనూ గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. గంజాయి అమ్ముతున్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 8కేజీల గంజాయి సహా మూడు కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల్లో వీటిని తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్లు వరుసగా బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినబడకుండా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్నారు.


Tags:    

Similar News