కవితకు హైబీపీ..కోర్టులో మరో పిటిషన్

By :  Vinitha
Update: 2024-03-23 07:30 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఈడీ తీసుకున్న కస్టడీ గడువు ముగియనుంది. అయితే ఆమె హైబీపీతో బాధపడుతున్నారని ఆమె తరపు లాయర్లు తెలిపారు. ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఇటు కవిత ఈడీ కస్టడీ ముగియనుండడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టన్నారు అధికారులు.

అయితే కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కవిత కస్టడీని ఆమె తరపు లాయర్లు అడ్డుకునే ప్రయత్నం చేయనున్నారు. కవిత ఆరోగ్య పరిస్ధితి బాగోలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News