మల్లారెడ్డి కాలేజీలో ఐటీ దాడులు

Byline :  Vamshi
Update: 2024-03-19 06:45 GMT

మల్లారెడ్డి కాలేజిలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ కంపెనీలలో ఐటీ దాడులు జరుగుతుండగా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీల్లో గత నాలుగు గంటలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి మల్లారెడ్డి కాలేజీలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మల్లారెడ్డి కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటీ ఆఫీసర్‌లు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్ పెట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు... వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాలేజీ మేనేజ్ మెంట్, సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు.

Tags:    

Similar News