గుండెపోటుతో జనగామ బీఆర్ఎస్ నేత మృతి

By :  Bharath
Update: 2023-12-04 16:14 GMT

జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. గుండెపోటు రావడంతో హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ లో చేర్చగా.. చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. అస్వస్థతకు గురైన వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్​రెడ్డి గెలుపు కోసం సంపత్ రెడ్డి చాలా కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు పాటుపడ్డారు. ఆయన మరణాన్ని స్థానిక నేతలు కుంగిపోయారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. 

Tags:    

Similar News