TSPSC చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా

Update: 2023-12-11 16:23 GMT

TSPSC చైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు జనార్ధన్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ శాంతి కుమారికి పంపారు. జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన సీఎం.. అనంతరంఆ ఫైల్ ను గవర్నర్ తమిళి సౌందర్ రాజన్ కు పంపారు. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ సీఎం ప్రకటించారు. ఈ లోపే జనార్ధన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాజీనామాకు ముందు జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. కాగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్ రెడ్డిని 2021 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే గతేడాది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం..య మళ్లీ ఆ పరీక్షను నిర్వహించగా అవకతవకలు జరిగాయంటూ హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. ఈ రెండు సందర్భాలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణలో కూడా కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో జనార్ధన్ రెడ్డిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. కానీ ఆయనను మాత్రం ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. TSPSCకి సంబంధించిన అన్ని వివరాలతో తనను కలవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జనార్ధన్ రెడ్డిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇవాళ సెక్రటేరియట్ కు వచ్చిన జనార్ధన్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇక జనార్ధన్ రెడ్డి రాజీనామాతో టీఎస్పీఎస్సీ కొనసాగిస్తారా లేక దాని స్థానంలో వేరే బోర్డునేమైనా ఏర్పాటు చేస్తారా అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

Tags:    

Similar News