ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చిన జీవన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే..

By :  Krishna
Update: 2023-11-27 06:10 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపటితో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ రాశారు. రామాలయంలో ప్రత్యేక పూజల తర్వాత ఆయన బాండ్ రాసి ప్రమాణం చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గత ఎన్నికల వేళ నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ రాసివ్వగా.. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు.

Tags:    

Similar News