సర్కారీ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్..

Byline :  Kiran
Update: 2023-10-02 15:36 GMT

సర్కారీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ రిపోర్టు ఇచ్చే వరకు ఉద్యోగులకు 5శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని నిర్ణయించింది.




 


కొత్త పే రివిజన్ కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్‌ ఎన్‌. శివశంకర్‌ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యుడిగా ప్రభుత్వం మరో రిటైర్డ్ ఆఫీసర్ బి.రామయ్యను నియమించింది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 6 నెలల్లోపు రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 




Tags:    

Similar News