KCR : ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్.. వారితో భేటీ..

Byline :  Krishna
Update: 2024-02-06 02:31 GMT

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌కు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణ భవన్కు వెళ్తుండడం ఇదే తొలిసారి. కృష్ణా పరివాహక ప్రాంతంలోని జిల్లాల నేతలతో ఉదయం 11 గంటలకు కేసీఆర్ సమావేశంకానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై ఆ జిల్లాల నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇస్తారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల అనంతరం నల్గొండ జిల్లాలో భారీగా బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభ నుంచే గులాబీ బాస్ లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గులాబీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.


Tags:    

Similar News