JaggaReddy : పీసీసీ పదవి నాకు కావాలి....ఎమోషనల్ అయిన జగ్గారెడ్డి

Byline :  Vinitha
Update: 2024-02-22 08:28 GMT

పీసీసీ పదవి కావాలని ఐదేండ్ల నుంచి అడుగుతున్నా అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఈ మేరకు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవేమేనని చెప్పుకొచ్చారు. అప్పట్లోనే రాహుల్ సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ పదవి తనకు కావాలని తన మనసులో మాట వెల్లిబుచ్చాడు. ఈ విషయాన్ని అదిష్టానాన్ని ఐదేండ్లుగా అడుగుతున్నానని చెప్పారు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు రాహుల్, సోనియాగాంధీ, మల్లికార్జున కర్గే తనను ఏ హోదాలో పెట్టాలో వాళ్లకి బాగా తెలుసని చెప్పారు.

కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి.. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీకి కంటిమీద కునుకు ఉండడం లేదని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందన్నారు. కిషన్ రెడ్డి, కేసిఆర్ ఆప్త మిత్రులని తెలిపారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు నష్టం రాకూడదనే బీజేపీ బండి సంజయ్‌ని తొలిగించిందని తెలిపారు. తన సీటునే కాపాడుకోలేని బండి సంజయ్..కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అంతేగాక ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఓడిపోయాక మైండ్ దొబ్బిందని చెప్పారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల దాక అయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తరువాత అధ్యక్షుడిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకి కూడా పీసీసీ పదవి కావాలని జగ్గారెడ్డి కోరడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

Tags:    

Similar News