Kishan Reddy : ప్రపంచ దేశాల సమస్యల పరిష్కారంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది: కిషన్ రెడ్డి

Byline :  Bharath
Update: 2024-01-01 06:38 GMT

2024 సంవత్సరం భారతదేశానికి ఎంతో కీలకమని కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు. ఈ నెల అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుందని.. ఆ రోజు హిందువులకు అసలైన పండుగ అని చెప్పుకొచ్చారు. 2024లో భారత్ ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్- గాజా, రష్యా- ఉక్రెయిన్ వంటి దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అందులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లిన సందర్భంగా కిషన్ రెడ్డి కుటుంబానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం చేయించారు.




Tags:    

Similar News